తెలంగాణలో గ్రీన్ మర్డర్.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

-

 రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ద్వారా 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ లు తీవ్రంగా ఫైర్ అయ్యాయి. తాజాగా దీనిపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా నిరసన గళమెత్తారు. తెలంగాణలో గ్రీన్ మర్డర్ జరుగుతోందంటూ ఎక్స్​లో పోస్టు చేశారు. గతంలో బీఆర్​ఎస్ ఇప్పుడు కాంగ్రెస్‌ కోతలు మరింత లోతుగా ఉన్నాయని విమర్శించారు.

కాళేశ్వరం కోసం బీఆర్​ఎస్ 25 లక్షల చెట్లను నరికేసింది. హరితహారం ముసుగులో కోనోకార్పస్‌ను (పర్యావరణానికి నష్టం కలిగించే మొక్కలు) బీఆర్​ఎస్​ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది. కంచ గచ్చిబౌలిలో జరిగిన హరిత విధ్వంసంలో కాంగ్రెస్‌ చేరింది. అదే గొడ్డలి చేతులు కొత్తవి. తెలంగాణలో అటవీ నిర్మూలన మాఫియాను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని ఆనుకుని చాలా వృక్షజాతులు, పక్షిజాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు ఉన్నాయి. అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news