సిల్లి ముఖ్యమంత్రికి విద్యార్థుల సమస్యలు సిల్లిగా కనిపిస్తున్నాయి – బండి సంజయ్

-

బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల కష్టాలు తెలుసుకునెందుకు బయలుదేరుతున్నానని.. ఒక్క ట్రిపుల్ ఐటీ నిర్వహణ కూడా కేసీఆర్ కి సాధ్యం కావడం లేదని నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇంకా ట్రిపుల్ ఐటి ఎలా మంజూరు చేస్తారు ? సిల్లి ముఖ్యమంత్రి కి సమస్యలు సిల్లిగా కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండి సంజయ్

సమస్యలు సిల్లి అయితే… ఎందుకు పరిష్కరించలేదని మండిపడ్డారు. టిఆర్ఎస్ … బీఆర్ఎస్ గా మారడం.. ఆ వెంటనే విఆర్ఎస్ పొందటం ఖాయమని తేల్చి చెప్పారు. ట్రిపుల్ ఐటి విద్యార్థులకు నీళ్లు, పవర్ కట్ చేయడం మూర్ఖత్వమని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

స్థానిక అధికారులు విద్యార్థులను భయపెడుతున్నారని.. గొంతెమ్మ కోరికలు కోరడం లేదని విమర్శలు చేశారు. ఇదే విధంగా వ్యవహరిస్తే… కొత్త వ్విఈడీద్యా సంస్థలు మంజూరు కష్టంగా మారుతుందని.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్తులు ద్వ0సం చేయడం మానుకొని… ఆలస్యంగానైనా సమస్యలు గుర్తించడం మంచిదేనన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version