14 వ రోజుకు చేరుకున్న బండి సంజయ్ ” ప్రజా సంగ్రామ యాత్ర”

-

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో 14వ రోజుకు చేరుకుంది. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా.. వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించనున్నారు బండిి సంజయ్. అనంతరం 14వ రోజు పాదయాత్ర ప్రారంభం కానుంది.

నేడు విసునూరు నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర.. వడ్డెర కాలనీ, లక్ష్మీనారాయణ పురం స్టేజ్ మీద నుండి పాలకుర్తి, లక్ష్మీనారాయణ పురం స్టేజ్, తొర్రూరు, శాతాపురం, ధర్మతాండ స్టేజ్ మీదుగా.. కడవెండి స్టేజి వరకు కొనసాగనంది. విసునూరు, పాలకుర్తిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు బండి సంజయ్. ఇవాళ మొత్తం 16 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. నేడు కడవెండి స్టేజి సమీపంలో బండి సంజయ్ రాత్రికి బస చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version