నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

-

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే ఐదు రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 18 వరకు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు ఈ వేడికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణ్‌పేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, మూడ్మైక్యు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎక్కువ సమయం బయట గడిపే వారు దాహం తగ్గించే విధంగా చల్లని ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది అని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news