అధికారంలోకి వస్తాం… ప్రజా పాలన అందిస్తాం : భట్టి విక్రమార్క

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తమ పార్టీకి దక్కుతున్న పాపులారిటీని చూసి తమను ఎలాగైనా ఓడించాలని బీఆర్ఎస్, బీజేపీలు తెరవెనుక కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతోందని… ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరుగుతుందని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో నియంతలా కేసీఆర్ ఒక్కరే ఉన్నారని.. కాంగ్రెస్ లో మాత్రం సీఎం పదవికి అర్హులైన నాయకులు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్తు పేటెంట్ ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ పార్టీ తెచ్చిన విద్యుత్తు ప్రాజెక్టులతోనే బీఆర్ఎస్ సర్కారు కరెంటు అందిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటు పార్టీ మేనిఫెస్టోను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 74  నుంచి 78 స్థానాలతో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news