హరీష్ రావు అగ్గిపెట్టే పట్టుకొని తిరుగుతుండు : భువనగిరి ఎంపీ

-

హరీష్ రావు ఎవరినన్న చంపాలని అగ్గిపెట్టే పట్టుకొని తిరుగుతుండు.. గతంలో శ్రీకాంత చారి ని చంపినట్లు చంపాలని చూస్తుండు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హరీష్ రావు ఈ వారం రోజుల్లో ఎదో ఒకటి చేయాలని స్కెచ్ వేసిండు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ని, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను, గొంగిడి సునీతను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తిరగనీయొద్దు. మూసి పై తప్పుడు ప్రచారం ప్రభుత్వాన్ని విలన్ గా చుపిస్తున్నారు.

హైడ్రా పై త్వరలో అఖిలపక్ష సమావేశం పెడతాం. 24 గంటలు పని చేసే కాంగ్రెస్ కు, ఫామ్ హౌస్ లో పండుకున్న బీఆర్ ఎస్ కు పొలికేంటి. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 60 వేల ఎకరాలు మూసి నది కింద పారుతుంది. హైడ్రాను, మూసి ప్రక్షాళన ను తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నాలపై 28వేల కట్టడాలు ఉన్నాయని కేసీఆర్ చెప్పిండు. హైదరాబాద్ ఆగం కావడానికి కారణం బీఆర్ఎస్ నాయకులు. డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని భువనగిరి ఎంపీ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version