చంపాపేట యువతి హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

-

హైదరాబాద్ లో చంపాపేటలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎల్బీనగర్ లో నివాసం ఉండే స్వప్న అనే యువతి నిన్న దారుణ హత్యకు గురైంది. ఇదే సమయంలో ఓ యువకుడు రెండో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేశాడు. ఈ రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మహబూబ్‌నగర్‌ హన్వాడ తండాకు చెందిన వర్త్య మోహన్‌ కుమార్తె స్వప్న (21), నల్లగొండ జిల్లా వాసి హన్మంతు 8 నెలల క్రితం హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అన్నాచెల్లెళ్లమని.. చదువు, ఉద్యోగం కోసం వచ్చినట్లు యజమానికి తెలిపారు. ఆమెకు మహేశ్వరం ప్రాంతానికి చెందిన టీ పాయింట్‌ నడిపే ప్రేమ్‌కుమార్‌ (24)తో నెల క్రితం పెళ్లయుంది. వీరు కలిసే ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తు నుంచి ప్రేమ్‌కుమార్‌ కిందపడ్డాడు. యజమాని వచ్చి చూడగా తీవ్రంగా గాయపడి కనిపించాడు. అదే సమయంలో మెట్లు దిగి ఇద్దరు యువకులు హడావుడిగా వెళ్లిపోయారు. యజమాని పైకి వెళ్లి చూడగా స్వప్న రక్తపు మడుగులో ఉంది. ఆమెను గొంతు కోసి హత్య చేశారు.

వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. స్వప్నను హత్య చేసింది భర్త ప్రేమ్‌ అని పోలీసులు గుర్తించారు. ప్రేమ్ స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే స్వప్న హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ప్రేమ్ ఇంటికొచ్చేసరికి ఇంట్లోనే స్వప్న, ఆమె ప్రియుడు సతీష్ ఉన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రేమ్.. సతీష్‌తో గొడవపడ్డాడు. ఈ గొడవ కాస్త పెద్దదవ్వడంతో ఇంట్లో ఉన్న కత్తితో స్వప్నను ప్రేమ్ హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news