అయోధ్య కు లడ్డులు పంపించారు.. కాబట్టే దొరికారు : మాధవి లత

-

ప్రస్తుతం ఆంద్ర ప్రదేహ్ లోనే కాకుండా తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వ్యవహారం పెద్ద చర్చగా మారింది. శ్రీవారి లడ్డులో కల్తీ వెయ్యి వాడారు అని సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించడంతో ఇది పెద్ద చర్చగా మారింది. అయితే ఇప్పటికే ఈ విషయం పై చాల మంది నేతలు చాల రకాలుగా స్పందించారు. ఇక తాజాగా బీజేపీ నేత మాధవి లత కూడా ఈ వ్యవహారం పై రియాక్ట్ అయ్యారు. తిరుపతి లడ్డు అంశం పై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి అని అన్నారు.

దైవ భక్తులు అయిన మోడీ, అమిత్ షాకి సీబీఐ విచారణ జరిపించాలనీ అందరూ మేసేజ్ లు పంపియండి అంటూ ప్రజలకు సూచించారు ఆమె. ఈ విషయంలో హిందువులు ఇక కాం గా ఉండరు. రాజకీయాలతో నాకు సంబంధం లేదు. ఇది మా విశ్వాసాలకు సంబంధించిన అంశం. మాకు నిజం తెలియాలి. ఇక పై హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు. చంద్రబాబు నాయుడు ఆధారాలు లేకుండా మాట్లాడరు కదా… అయోధ్యకు ఈ లడ్డులు పంపించారు. రామునికి పంపారు కాబట్టే అసలు విషయం బయట పడ్డది అని మాధవి లత అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news