ఆన్​లైన్​లో ఎక్కువగా చాటింగ్ చేస్తోందని చెల్లిని చంపిన అన్న

-

ఆన్​లైన్​లో చాటింగ్ చేస్తోందని.. సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతోందని చెల్లిని చంపేశాడు ఓ అన్న. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్ నగర్​లో చోటుచేసుకుంది. అనంతరం రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేయగా.. గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్‌నగర్‌కు చెందిన అజ్మీర సింధు(21) అలియాస్‌ సంఘవికి తల్లి, సోదరుడు హరిలాల్‌ ఉన్నారు. మహబూబాబాద్‌లో ఏఎన్‌ఎం అప్రెంటిస్‌ చేస్తున్న సింధు సోషల్‌ మీడియాలో తరచూ రీల్స్ చేసి పెడుతుండేది. ఇది హరిలాల్​కు నచ్చక ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఇదే విషయమై సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో హరిలాల్‌ రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ తీసుకెళ్తుండగా మృతి చెందారు. కుటుంబసభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news