BRS పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ తరుణంలోనే కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, పార్టీ వ్యవస్థాపక కార్యకర్త నాగమణి మరణం పట్ల సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన పార్టీ వ్యవస్థాపక కార్యకర్త, పార్టీ ప్రారంభ కాలం నుంచి పార్టీకి నాగమణి చేసిన సేవలను వారి ఉద్యమ కృషిని స్మరించుకుని.. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన కేసీఆర్… ఎమోషనల్ అయ్యారు. ఇక అటు ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో కేటీఆర్, హరీశ్ రావు, వినోద్కుమార్ భేటీ నిర్వహించారు. ఈ నెల 14న కరీంనగర్లో నిర్వహించే బీసీ సభపై చర్చిస్తున్నట్లు సమాచారం.