బైక్​పై వచ్చి కోరుట్ల బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తను నరికేశారు!

-

జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్‌ భర్తపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలోని ఓ హోటల్లో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మీరాజం(48) టీ తాగుతున్నారు. ఈ క్రమంలో బైక్​పై అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు అతడి మెడపై కత్తితో దాడి చేసి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. తీవ్ర గాయాలతో లక్ష్మీరాజం పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆయన్ను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన కాసేపటికే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనా స్థలిని డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Read more RELATED
Recommended to you

Exit mobile version