భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌

-

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. మహబూబాబాద్ పార్లమెంటరి నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీ ని నియమించింది BRS పార్టీ. పది మంది సభ్యులతో కూడిన కమిటి ప్రకటన చేసింది గులాబీ పార్టీ.

tellam venkat rao revanth reddy clarity on party change

అయితే.. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ పార్టీ. తాజాగా ప్రకటన చేసిన కమిటీ లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కు చోటు దక్కలేదు. ఇటీవల కాంగ్రెస్ సమన్వయ మీటింగ్ కు వెళ్లారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. దీనితో BRS ఎమ్మెల్యే లేకుండానే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కాగా రేపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version