9 మందిని కాపాడిన వ్యక్తికి BRS లీడర్ల సన్మానం

-

తెలంగాణలో గత రేడు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. దానితో చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నగరంలోని చాలా కాలినిలోకి నీళ్లు వచ్చేసాయి. ప్రకాష్ నగర్ ను మొత్తం ముంచేసింది మున్నేరు వాగు. ఈ క్రమంలోనే ప్రకాష్ నగర్ వంతెన 9 మంది చిక్కుకు పోయారు. కానీ వారిని రక్షించడంలో అధికారులు ఆలస్యం చేయడంతో.. పరిస్థితి ప్రమాదంగా మారేలా ఉండటంతో స్థానికులే వారిని రక్షించారు.

పోలీసులు వద్దు అని చెప్పినా వారితో వరించి JCB సాయంతో వారిని రక్షించారు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ 9 మందిని రక్షించిన వ్యక్తిని బీఆర్ఎస్ లీడర్ పువ్వాడ అజయ్ మరియు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సన్మానించారు. అలాగే అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news