బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. సీఎం రేవంత్‌ను కలిసి చేవెళ్ల ఎమ్మెల్యే

-

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన త్వరలో కారు దిగి కాంగ్రెస్‌‌లో చేరుతారనే ప్రచారం నడుస్తోంది. ఇటీవలే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరతారనే టాక్ వినిపిస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీని కీలక నేతలు వీడుతున్నారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశన్ నేత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు ఇటీవలే బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదోనన్న సంకోచంతో ఉన్న ఈ నాయకులు పార్టీ వీడినట్లు సమాచారం. అయితే ఇందులో బీజేపీలో చేరిన బీబీ పాటిల్‌కు ఎంపీ టికెట్ రాగా, రాములు కుమారుడుకి బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version