రైతుబంధును డైలీ సీరియల్‌లా వేయకండి..ఫ్లీజ్ : పల్లా

-

 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రజల గొంతును వినిపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. రైతు బంధును డైలీ సీరియల్‌ లాగా కాకుండా.. ఒకేసారి వేయాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం చేయాలని.. రైతు రుణమాఫీ లాగా ఆటో రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

brs mla palla rajeshwar reddy in assembly

ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లకు నెలకు 10 వేల రూపాయలు ఇవ్వాలి…. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని 3 డిమాండ్లు చేస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచండని కోరారు.అధాని నీ వద్దు అనుకుంటే…సిఎం ఒప్పందాలు చేసుకుని వచ్చారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ అన్నట్టే అదానీ పెట్టుబడులు వద్దని కోరారు. ఆదాపీ వస్తే… తెలంగాణ ప్రగతి ఆగిపోతుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version