తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం..మెజార్టీ సీట్లు గెలుస్తాం – కిషన్‌ రెడ్డి

-

తెలంగాణలో 17 సీట్లలో పోటీ చేస్తాం..మెజార్టీ సీట్లు గెలుస్తామని ప్రకటించారు బీజేపీ తెలంగాణ చీఫ్‌ కిషన్‌ రెడ్డి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలని..ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్లాలని బీజేపీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలనేదానిపై ఎన్నికల మీటింగ్ లో చర్చ జరిగిందని..కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి వివరాలు సేకరించామని తెలిపారు.

kishan reddy on bjp seats of mp

ప్రాబబుల్స్ లిస్ట్ రెడీ అయిందని.. త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. బీజేపీ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో తెలంగాణ సీట్లు కూడా ఉంటాయన్నారు. తెలంగాణ లో 17 సీట్లలో పోటీ చేస్తాం.. మెజార్టీ సీట్లు గెలుస్తామని వివరించారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని…ప్రజల నుంచి సానుకూల స్పందన కనబడుతోందని వివరించారు. మా ప్రతిపక్షాలు నైరాశ్యంగా ఉన్నాయని చురకలు అంటించారు బీజేపీ తెలంగాణ చీఫ్‌ కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version