కాంగ్రెస్‌ లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

-

 

కాంగ్రెస్‌ లోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెళుతున్న తరుణంలో..కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని… 2004-06 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నామన్నారు.

BRS MLAs into Congress KTR’s sensational comments

తెలంగాణ ప్రజల ఆందోళనను ఉధృతం చేయడం ద్వారా గట్టిగా ప్రతిస్పందించింది… చివరికి కాంగ్రెస్ తల వంచవలసి వచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్‌. ఇప్పుడు అదే చరిత్ర పునరావృతమవుతుందన్నారు. కాగా కరీంనగర్‌ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్‌ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం చేరిక షాక్ నుంచి తెరుకోక ముందే సంజయ్ మరో షాక్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సంజయ్ కూడా హస్తం గూటికి చేరడం సంచలనంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version