ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

-

ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఇవాళ పరామర్శించనుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. ఇవాళ ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి,పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గార్లు,మరియు తెలంగాణ రాష్ట్ర బృందం…ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ ఇంటికి రానుంది.

 

BRS MLAs visit the house of Rythu Prabhakar

అనంతరం ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ ను కలవనున్నారు గులాబీ నేతలు. కాగా, తాజాగా అప్పుల బాధతో మరో ఖమ్మం రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం జానకీపురం గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మయ్య (40) తనకున్న 3 ఎకరాల పొలంతో మరికొంత భూమి కౌలు తీసుకొని వరి, పత్తి, మిర్చి పండిస్తున్నాడు. అప్పుల పాలై దిగుబడి సరిగా రాకపోవడంతో పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version