రేపు విజయవాడకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

-

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం రోజున ఏపీలో పర్యటించనున్నారు. జులై 8వ తేదీన విజయవాడకు వెళ్లనున్న ఆయన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు. ఆయన వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెళ్లనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభకు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం, మంత్రులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ఆమె ఇటీవల వరుసగా ముఖ్యమంత్రి, మంత్రులను వేర్వేరుగా ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు.

మరోవైపు శనివారం రోజున ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిశారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో విభజన సమస్యలపై చర్చించారు. మూడంచెల విధానంతో విభజన సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version