రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై నేడు బీఆర్ఎస్ నిరసనలు

-

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వాక్యాలకు నిరసనగా బీఆర్ఎస్ ఇవాళ ఆందోళనలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించనుంది. రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేయడంతో పాటు శవయాత్ర చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

brs party

ఇక అటు CM పదవిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో గిరిజన ఎమ్మెల్యే సీతక్క సీఎం కావచ్చనే కామెంట్స్ వచ్చాయని… బిఆర్ఎస్ లో బీసీ సీఎం అనే ఆలోచన వస్తే మీరు పోటీలో ముందుంటారా? అని నిన్న మీడియా ప్రతినిధులు అడిగారు. ‘నేను రాజకీయాల్లో ఈ స్థాయికి చేరుకున్న. నాకు సీఎం కావాలని ఆశ లేదు. ఆశకు కూడా ఓ హద్దు ఉండాలి. ఇప్పుడు ఉన్న దానితో సంతోషంగా ఉన్నా’ అని తలసాని సమాధానం ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version