తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలెర్ట్

-

తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా  ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, ములుగు, కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండలో భారీ వానలు పడుతాయని చెప్పారు.

గురువారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వానలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version