సిరిసిల్లలో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన కేటీఆర్

-

సిరిసిల్లలో నామినేషన్ వేసేందుకు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్లకు బయలుదేరే ముందు తన నివాసం ప్రగతి భవన్లో పూజ నిర్వహించిన కేటీఆర్… 11:45 నిమిషాలకు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొననున్నారు కేటీఆర్. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

BRS working president KTR left for nomination in Sirisilla

ఇక అటు బిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నవంబర్ 9 అంటే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి గా, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నారు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు గజ్వేల్ లో…మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి లో.. నామినేషన్ దాఖలు చేస్తారు గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌. అనంతరం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version