తెలంగాణ రాష్ట్రంలో బస్ టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ సర్వీస్ లలో రూ. 10 అదనంగా తీసుకుంటున్నారని కొంతమంది ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే టోల్ గేట్లు ఉన్న మార్గాలలో ఒక్క టోల్ గేట్ కు రూ. 10 చొప్పున వసూలు చేస్తున్నారని మళ్లీ ఇప్పుడు కొత్తగా మరోసారి చార్జీలు పెంచడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కిలోమీటర్ల రేషనలైజేషన్ పేరిట టికెట్ ధరలు పెంచినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై ఆర్టీసీ సంస్థ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి ఇలా పురుషులపై అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కొంతమంది పురుషులు వాపోతున్నారు. పెంచిన టికెట్ల ధరలను వెంటనే తగ్గించాలని లేకపోతే కఠినంగా ప్రవర్తిస్తామని కొంతమంది పురుషులు ఆగ్రహిస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.