గ్రూపు-1 నోటిఫికేషన్ రద్దు.. TSPSC కీలక ప్రకటన

-

తెలంగాణలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం  వెబ్ నోటును విడుదల చేసింది TSPSC. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయg అందరికీ తెలిసిందే. అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.

ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో కొద్దిరోజుల పాటు కేసు కూడా నడిచింది. హైకోర్టు నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధన ప్రకారం పరీక్షను నిర్వహించలేదని పరీక్షను మరొకసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. ఇటీవలే మరో 60 గ్రూప్ వన్ పోస్టులకు కొత్త ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేస్తూ టిఎస్పిఎస్సి కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 563 పోస్టులతో కలిపి అతి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version