బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మత విశ్వాసాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాజాసింగ్ పై కేసు నమోదైంది. ఒక వీడియో సందేశంలో అజ్మీర్ దర్గా పై విశ్వసనీయత కోల్పోయేలా రాజాసింగ్ కామెంట్లు చేశారంటూ ఒక ప్రముఖ వ్యక్తి పై కించపరిచే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు శాసనసభ్యుడు పై ఫిర్యాదు నమోదైంది.

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చూసిన తర్వాత.. మహమూద్ అలీ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఆ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు న్యాయ సలహా తీసుకున్న అనంతరం రాజాసింగ్ పై ఐపిసి సెక్షన్ 295A కింద కేసు బుక్ చేశారు. మత విశ్వాసాలను కించపరిచేలా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు అందడంతో.. న్యాయ సలహా తీసుకున్న అనంతరం అతనిపై కేసు బుక్ చేశామని, ఈ కేసులో విచారణ కొనసాగుతోంది అని సిఐ ఉమామహేశ్వర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news