Etela Rajender : ఈటలకు కేంద్ర భద్రత.. Y కేటగిరీ భద్రత..

-

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించే అవకాశం ఉంది.

ఈటల హత్యకు కొందరు కుట్ర పన్నారని ఆయన భార్య ఆరోపించడం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండు రోజుల్లో దీనిపై అధికారిక ఆదేశాలు రానున్నట్లు సమాచారం. కాగా,  ఈటెల బిజెపిలోనే ఉన్నారని, పార్టీలో సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. పదవి కోసం తలవంచుకోవడం తమ రక్తంలోనే లేదన్నారు జమున.ఓటు వేసేది ప్రజలు అని.. ప్రజలు అనుకుంటే ఎవరైనా గెలుస్తారని అన్నారు. తాను పార్టీ మారను అని ఇప్పటికే రాజేందర్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version