సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌ పర్యటనలో మార్పు !

-

సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌ పర్యటనలో మార్పు చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనను ఒకరోజు పొడగించారు. దీంతో ఇవాళ హైదరాబాద్‌ కు రావాల్సిన సీఎం రేవంత్‌ రెడ్డి… మరోక రోజు పాటు లండన్‌ లోనే ఉంటారు. రేపు ఉదయం హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

Change in CM Revanth Reddy’s visit to Davos

కాగా, లండన్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ గడుపుతున్నారు. లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పలు స్మారక కేంద్రాలను సందర్శించారు. లండన్ లో ప్రపంచ ప్రసిద్ధమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక కట్టడాలనూ, స్మారక కేంద్రాలను ఆయన సందర్శించారు.

బిగ్‌బెన్, లండన్‌ ఐ, టవర్‌ బ్రిడ్జ్‌ ఎట్‌ ఆల్‌ కట్టడాలను సీఎం తిలకించారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను సీఎం అడిగి తెలుసుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో సీఎం అక్కడ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news