వినయ్ వీర్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ప్రముఖ జర్నలిస్టు, హిందీ మిలాప్ సంపాదకులు వినయ్ వీర్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. వినయ్‌ వీర్‌ మరణం పట్ల పత్రికా రంగానికి ముఖ్యంగా హిందీ జర్నలిజానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

Chief Minister Revanth Reddy condoles the death of Vinay Veer, editor of Hindi Milap, a prominent journalist

ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు యుధ్ వీర్ కుమారుడైన వినయ్ వీర్ దక్షిణాదిన హిందీ జర్నలిజంలో ఎనలేని సేవలు అందించారని స్మరించుకున్నారు. తండ్రి మరణానంతరం యుధ్ వీర్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగించారని కొనియాడారు. ఫోటో జర్నలిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఆయన మరణం పట్ల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news