70 ఏళ్ల వయసులో.. ‘ఇంటర్‌’ పరీక్షలు

-

నిజామాబాద్‌కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్‌ చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు. 78 ఏళ్ల వయసులో ఆయన ఇప్పుడు ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నారు. ఎల్లాగౌడ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి 2007లో రిటైర్‌ అయిన ఆయన.. ఈ నెల 25 నుంచి ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాగా.. నిజామాబాద్‌ శివారులో బోర్గాం(పీ) కేంద్రంలో పరీక్షలు రాస్తున్నారు.

శనివారం రోజున తన కుమారుడు ఆయన్ను పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యానని.. ఇప్పుడు ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. చిన్నప్పుడు ఏడో తరగతి వరకు చదువుకున్నానని.. తర్వాత అనివార్య కారణాలతో మానేశానని చెప్పారు. అనంతరం పెళ్లి, ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతలతో తీరిక ఉండేది కాదని.. కానీ మనసులో చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేదని తెలిపారు. అందుకే పదవీ విరమణ తర్వాత ఓపెన్‌ స్కూల్‌ విధానం ఎంచుకున్నానని ఎల్లాగౌడ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news