చంద్రబాబు కీలక నిర్ణయం.. నేడు శాంతిభద్రతలపై శ్వేతపత్రం

-

చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల అంశంపై నేడు(గురువారం) సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియాకు సీఎం వివరాలు వెల్లడిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

CM Chandrababu will release a white paper on law and order today

గడిచిన ఐదేళ్లలో నమోదైన అక్రమ కేసులు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడి కత్తి, డాక్టర్ సుధాకర్, వివేకా హత్య కేసులు, తదితర అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పల్లకి మోసిన క్యాడర్ కు పదవులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్దమవుతున్నారు.. మరో వారం రోజుల్లోనే నామినెటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఆయన సిద్దమవుతున్నారు.. దీంతో తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోలాహలం అలుముకొంది.. జిల్లాల వారీగా పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలను అధినేత సేకరిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version