AP: తిరుపతిలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. క్రైమ్ రేట్ క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలపై దాడులు ఎక్కడ కూడా ఆగడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినా కూడా… ఏపీలో క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. రోజుకో…. దారుణమైన సంఘటన ఏపీలో జరుగుతోంది. అయితే తాజాగా… తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగింది.

నంద్యాల రేప్ ఉదంతం మరవకముందే మరో ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి దొరవారిసత్రం మండలం నెలబల్లి గ్రామంలో రైస్ మిల్లులో పనికోసం బీహార్ నుండి వచ్చిన లాలుకుమార్ కూతురు అనిక(8)పై అత్యాచారం, హత్య జరిగింది. అదే రైస్ మిల్లులో పనిచేస్తున్న ఒక వ్యక్తి బిస్కెట్లు ఆశ చూపి పక్కనే ఉన్న అడవిలో తీసుకెళ్లి రేప్ చేసి హత్య చేశారు. ఈ కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version