ఆ రోజు అందరికీ సెలవు రోజే – సీఎం కేసీఆర్‌ ప్రకటన

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. లంబాడాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి రోజు తప్పనిసరిగా సెలవు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు సెలవు ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నిన్నటి ఆందోల్ సభలో కేసీఆర్ తెలిపారు.

CM KCR announced that a holiday will be given on the day of Sant Sewalal Jayanti, the idol of Lambadas

బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిందని, రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిందని చెప్పారు. ఇది ఇలా ఉండగా… ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్ ఇప్పటి వరకు 94 సభల్లో పాల్గొన్నారు.  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సీఎం కేసీఆర్.. అక్టోబర్ 15వ తేదీన ఎన్నికల ప్రచారం షురూ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news