ఇవాల్టి నుంచి సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం..మళ్లీ అధికారమేనా!

-

CM KCR Rajshyamala yagam : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రోజుకు మూడు బహిరంగ సభలలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. హెలికాప్టర్లో తిరిగి… అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే.. ఓ మూడు రోజుల వరకు ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ దూరం కనున్నట్లు సమాచారం అందుతుంది.

CM KCR Rajshyamala yagam

దీనికి కారణం రాజ శ్యామల యాగం. సేమ్ కేసీఆర్ ఇవాల్టి నుంచి రాజ్యశ్యామల యాగం చేయనున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మూడు రోజులపాటు సీఎం కేసీఆర్ దంపతులు ఈ యాగంలో పాల్గొననున్నారు. ఏపీ మరియు కర్ణాటక కు చెందిన 200 మంది పురోహితులు ఈ యాగానికి హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news