మహిళలకు ఉచితంగా వైద్యపరీక్షలు అందించేలా.. కొత్త పథకం తీసుకువస్తామని సీఎం రేవంత్ ప్రకటన చేశారు. ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు సీఎం రేవంత్. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ. 21 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతుల పనుల బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీ లకు అప్పజెప్పామై గుర్త చేశారు. అదానీ, అంబానీ ల తో పోటీ పడే విధంగా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ లను ఏర్పాటు చేయించామని వెల్లడించారు. పెట్రోల్ బంక్లు, పాఠశాల నిర్వహణ, ఉనిఫాం కుట్టు పనులతో పాటు మహిళా శక్తి కాంటీన్ లు నిర్వహించేలా మహిళలను ప్రోత్సహించామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.