నేడు ఆసిఫాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన

-

వరుస పర్యటనలు, సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగులు, రోడ్డు షోలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. మిషన్ -15 లక్ష్యంగా ఈ ఎన్నికల్లో 15 స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ వారిని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలు చేస్తున్నామని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపిస్తే ఇంకా ఎన్నో ప్రజలకు ఉపయోగ పడే సంక్షేమ పథకాలు తీసుకువస్తామని చెబుతున్నారు. ఆరు గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ వంటి ఇతర హామీలను తప్పక నెరవేరుస్తామని బల్ల గుద్ది చెబుతున్నారు.

ఇలా నిత్యం సుడిగాలి పర్యటనలతో సీఎం రేవంత్ రెడ్డి తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కూడా ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి బిజీ కానున్నారు. నేడు ఆసిఫాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఆసిఫాబాద్‌లోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న జనజాతర బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version