చంద్రబాబు ప్రమాణస్వీకారానికి తప్పకుండా వెళ్తా : సీఎం రేవంత్

-

ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని తాను గతంలోనే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రాలో విజయఢంకా మోగించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని తెలిపారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ చట్టపరంగా తేలిపోయిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు సంపూర్ణ రాజధాని అని గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్దతో కూడుకున్న హామీ అన్న రేవంత్.. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని పునరుద్ఝాటించారు.

“రాముడు పేరుతో ఓట్ల యాచకానికి పాల్పడిన బీజేపీని రాముడు కూడా క్షమించలేదు. రామ మందిర నిర్మాణం చేపట్టిన ఫైజాబాద్‌లో బీజేపీ ఓడిపోయింది. బీజేపీతో కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. మా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతున్నాయనే అనుమానాలున్నాయి. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు కేసీఆర్ అని బీజేపీ ఆరోపించింది.” అని రేవంత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version