ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నట్టు తెలిపారు. హామీల అమలుకు ప్రణాళిక, కార్యచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధం అన్నారు. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదు. చర్చకు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలి సీఎం రేవంత్ స్పష్టం చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి.. బీజేపీని ఆదరించాలి.
బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుంది. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ లను స్వాగతిస్తాం. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చితే వ్యతిరేకిస్తాం. బీజేపీతో బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో అనేక సార్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. నిన్న నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసి బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.