పద్మశాలిల దెబ్బ..CM రేవంత్ సిరిసిల్ల పర్యటన రద్దు…?

-

ఈ నెల 7న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజన్నసిరిసిల్ల పర్యటన రద్దు అయింది. రాజన్న ఆలయ సెంటిమెంట్, పద్మశాలీల నిరసన సెగలతో పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. వేములవాడ రాజన్న దర్శనం చేసుకుంటాడని షెడ్యూల్ విడుదల అయింది. అయితే, రాజన్న దర్శనం చేసుకుంటే పదవి పోతుందనే అపవాదు ఉండడంతో పర్యటన రద్దు చేసుకున్నారట.

cm revanth reddy cancled his siricilla tour

పదవి లోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదు ప్రయోగాలు వద్దు అన్నారట సన్నిహితులు. మరోవైపు సిరిసిల్ల పద్మశాలి సమాజాన్ని ఉద్దేశించి స్థానిక కాంగ్రెస్ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలతో సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిక లు జారీ చేసారూపద్మశాలి సంఘం సభ్యులు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బంది అవుతుందనే సాకుతో పర్యటన వాయిదా వేసుకున్నారట సీఎం రేవంత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version