ప్రజల వద్దకు ప్రజాపాలన తీసుకువచ్చిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే బాలు నాయక్

-

ప్రజల వద్దకు ప్రజాపాలన తీసుకువచ్చిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని  గుడిపల్లి మండలంలోని చిలుక మర్రి గ్రామ పరిధిలోని శ్రీ తిరుమల కాటన్ జిన్నింగ్ మిల్ వద్ద సీసీఐ కేంద్రాన్ని ఆయన  ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ త్వరలోనే రైతు భరోసా 7500 రూపాయలు ఇస్తామన్నారు.ఈ నెలాఖరులోగా రూ 2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు.వచ్చే నెల నుంచి రూ.2 లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు.మరో వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు.

వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా మూడు దఫాలుగా రైతులకు సుమారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే  దక్కుతుందన్నారు. ప్రతిపక్షాలు అవాక్కులు చేవాక్కులు పేలుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రజలు రెండు సార్లు కర్రు కాల్చి వాత పెట్టిన కూడా బుద్ధి లేకుండా ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version