తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఆవరణను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి..!

-

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసారు సీఎం.

అయితే తాజాగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి… ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సచివాలయ ఆవరణను పరిశీలించారు సీఎం. విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించిన సీఎం.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు. పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version