రెండు రోజులు కాలేజీలు బంద్…!

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు కాలేజీలు బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 3, 4 తేదీలలో ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల బంద్ కు PDSU పిలుపునిచ్చింది. విద్యారంగంపై ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం, రూ. 8 వేలకోట్ల రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

college
Colleges across Telangana state to remain closed for two days

విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యారంగంపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపడుతున్నట్టుగా తెలిపారు. వెంటనే బకాయిలు చెల్లించి, విద్యార్థులను ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news