ఈనెల 10 కామారెడ్డిలో కాంగ్రెస్ సభ.. కర్నాటక సీఎం హాజరు

-

కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 10వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది.ఈ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాల్గొంటారు. ఇదే సభలో బీసీ డిక్లరేషన్ ను సిద్దరామయ్య విడుదల చేయనున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి పోటీచేస్తున్నారు. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుంది. ఈ స్థానం నుండి గతంలో షబ్బీర్ అలీ ప్రాతినిథ్యం వహించారు.అయితే ఈ దఫా షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉంది.

కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి తొలిసారిగా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. కేసీఆర్ పై బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డిని బరిలోకి దింపుతుంది. కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కూడ రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే మూడో జాబితాలో కామారెడ్డి పేరుండే అవకాశం ఉంది. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుండి రేవంత్ రెడ్డి ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కామారెడ్డి బహిరంగ సభలోనే బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించనుంది.

తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్ధిని సీఎంగా చేస్తామని బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రకటించిన మూడు జాబితాల్లో బీసీ, మహిళలకు పెద్దపీట వేసింది. ఓసీలకంటే బీసీలకు ఎక్కువ సీట్లను బీజేపీ కేటాయించింది.ఈ దఫా ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుండి కూడ కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version