మాగంటి పార్ధీవ దేహం పాడె మోశారు కేటీఆర్, హరీష్ రావు. కాసేపటి క్రితమే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి నివాసం నుండి మహాప్రస్థానం వరకు మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర ప్రారంభమైంది.

ఈ తరుణంలోనే మాగంటి పార్ధీవ దేహం పాడె మోశారు కేటీఆర్, హరీష్ రావు. అటు మాగంటి గోపినాధ్ కుటుంబసభ్యులను పరామర్శించారు కేసీఆర్, నారా లోకేష్. కన్నీళ్లు పెట్టుకున్నారు కేసీఆర్. మాగంటి గోపినాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి కన్నీళ్లు పెట్టుకున్నారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మాదాపూర్ లోని ఆయన నివాసానికి భౌతిక కాయం తరలించారు.
ప్రారంభమైన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర
దివంగత ఎమ్మెల్యే మాగంటి నివాసం నుండి మహాప్రస్థానం వరకు ప్రారంభమైన మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర
మాగంటి పార్ధీవ దేహం పాడె మోసిన కేటీఆర్, హరీష్ రావు pic.twitter.com/ssGxJPgjHx
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2025