సూర్యాపేటలో దామోదర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వను – పటేల్ రమేష్ రెడ్డి

-

సూర్యాపేటలో దామోదర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ నేత పటేల్ రమేష్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రెబల్స్‌ నాయకులను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్‌ అధిష్టానం. అయితే…కాంగ్రెస్ రెబల్స్ మాత్రం వెనక్కి తగ్గను అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ నేత పటేల్ రమేష్ రెడ్డి, జంగా రాఘవ రెడ్డి అస్సలు వెనక్కి తగ్గడం లేదు.

congress rebals

సూర్యాపేటలో దామోదర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని చెబుతున్నారు పటేల్ రమేష్ రెడ్డి. నేను పోటీలో ఉంటాను. పోటీ నుండి తప్పుకోమని నన్నెవరూ అడగలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కూడా నాతో మాట్లాడలేదు. బుజ్జగింపులకు తలొగ్గేది లేదన్నారు పటేల్ రమేష్ రెడ్డి. నన్ను మోసం చేసి నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారన్నారు జంగా రాఘవ రెడ్డి. వరంగల్ వెస్ట్‌లో నాయినిని గెలవనివ్వను.. పోటీ నుండి వెనక్కి తగ్గనని పేర్కొన్నారు జంగా రాఘవ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news