సెలూన్ యజమాని లైంగిక దాడి..శానిటైజర్ తాగి యువతి సూసైడ్

-

సెలూన్ యజమాని లైంగిక దాడి జరిగింది. దింతో శానిటైజర్ తాగి యువతి సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బాలాపూర్ మండలం, టీచర్స్ కాలనీలోని గత కొంతకాలంగా సెలూన్‌లో పనిచేస్తున్న యువతి(18)పై యజమాని మురళి(35) లైంగిక దాడికి పాల్పడుతుండటంతో ఆమె శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది.

crime in meerpet

దేవరకొండకు చెందిన దివ్య వయసు 18 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. యువతి పనిచేస్తున్న సెలూన్ యజమాని మురళి వేధిస్తున్నాడని, పలు సార్లు రేప్ చేసాడని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది దివ్య. ఇక ఈ సంఘటన పై మీర్ పెట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి బాడిని తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు సెలూన్ ముందు డెడ్ బాడీతో ధర్నా చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news