జనగామ MLA ముత్తిరెడ్డి నుంచి ప్రాణహాని ఉంది: అసిస్టెంట్ ప్రొఫెసర్

-

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈ మధ్య వివాాల్లో ఎక్కువగా ఇరుక్కుంటున్నారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఓ ప్రొఫెసర్ వేడుకున్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామానికి చెందిన నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, బాధితుడు భూక్యా తిరుపతి నాయక్, ఆయన భార్య మౌనిక బషీర్‌బాగ్‌లో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

బొత్తలపర్రె గ్రామంలోని సర్వే నెంబర్‌ 49, 88లో ఉన్న 20 ఎకరాల వ్యవసాయ భూమిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ప్రొఫెసర్ దంపతులు ఆరోపించారు. తమకు చెందిన 20 ఎకరాల భూమిని ఎమ్మెల్యే తన అనుచరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని వాపోయారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయన నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news