పాకిస్తాన్ బౌలర్లకు ఇండియా భయపడుతోందా ?

-

ఆసియా కప్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇండియా మరియు పాకిస్తాన్ లు తలపడి ఆ మ్యాచ్ కాస్తా వర్షార్పణం అయింది. అయినప్పటీకే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పైచేయి సాధించింది… ముఖ్యంగా ఈ జట్టు స్టార్ బౌలర్లు షహీన్ షా ఆఫ్రిది, హరీష్ రాఫ్ మరియు నసీం షా లు ఇండియా ఆటగాళ్లను వణికించారు. ఇండియాకు కీలక ప్లేయర్ లుగా ఉన్న రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లను షహీన్ షా ఆఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్, గిల్ లు కూడా స్వల్ప స్కోర్ లకే వెనుతిరిగారు. ఆ సమయంలో హార్దిక్ పాండ్య మరియు ఇషాన్ కిషన్ లు నిలబడి ఆడకుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది.. కానీ వీరిద్దరూ అయిదవ వికెట్ కు 100 కు పైగా పరుగులు జోడించి ఇండియా పరువును కాపాడారు. ఇక ఆదివారం పాకిస్తాన్ తో జరగనున్న మరో మ్యాచ్ లో భాగంగా ఇండియా ఆటగాళ్లపై సోషల్ మీడియాలో పాక్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

ఇండియా ఆటగాళ్లు పాక్ బౌలర్లు అంటే భయపడుతున్నారు అంటే, ఇందుకు సమాధానంగా ఇండియా ఫ్యాన్స్ మెగా టోర్నీలలో పాక్ ఇప్పటి వరకు గెలవలేదు అది చూసుకోండి ముందంటూ కౌంటర్ లు ఇస్తున్నారు. మరి ఈ మ్యాచ్ లో ఇండియా పాక్ ల మధ్యన ఏ విధంగా మ్యాచ్ జరగనుందో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news