దేవీ శ్రీ ప్ర‌సాద్ హిందువుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి : రాజాసింగ్

-

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అవుతున్నాయి. ఇటీవ‌ల దేవీ శ్రీ ప్ర‌సాద్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కు సంగీత ద‌ర్శ‌కుడి గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే ఆ సినిమా లో ఊ అంట‌వా మావా ఊఊ అంటావా మావా అనే పాట కు కూడా దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించాడు. అయితే తాజా గా పుష్ప సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగం గా దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ ఐటెం సాంగ్ ను భ‌క్తి పాటలా పాడాడు. అంతే కాకుండా ఐటెం సాంగ్స్, దేవుళ్ల పాటల త‌న దృష్టిలో ఒక్క‌టే అని అన్నారు.

అయితే ఈ వ్యాఖ్య‌ల పై ఇప్ప‌టికే ప‌లువ‌రు స్పందించారు. తాజా గా గోషా మహాల్ ఎమ్మ‌ల్యే రాజా సింగ్ కూడా ఈ వ్యాఖ్య‌ల పై స్పందించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ అలాంటి వ్యాఖ్య‌లు చేయాల్సింది కాద‌ని అన్నారు. ఆయ‌న వ్యాఖ్య‌ల తో హిందువుల మ‌నోభావాలు దెబ్బ తిన్నాయ‌ని అన్నారు. దేవీ శ్రీ ప్రసాద్ హిందువులకు త‌క్షణం క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లేకుంటే ఆయ‌న బ‌య‌ట తిర‌గ‌లేర‌ని అన్నారు. హిందువులు ఆయ‌న వ్యాఖ్య‌ల ప‌ట్ల ఆగ్ర‌హం తో ఉన్నార‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news