తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో… రైతుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు… రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. రైతులకు న్యాన్యమైన విత్తనాలను పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారు.

ఇక ఇవాళ గ్రామ గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటన చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 11000 గ్రామాల్లో 40 వేల మంది రైతులకు విత్తన కిట్లు అందించబోతున్నామని స్పష్టం చేశారు. వరి, మినుము, జొన్నలు అలాగే పెసర విత్తనాలకు సంబంధించిన కిట్లను కూడా ఇవ్వనున్నామని ప్రకటన చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.