ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్ కాలేజీలు రీఓపెన్ కారున్నాయి. నేటి నుంచి విద్యార్థులకు తరగతిలో క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఈరోజు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. కాగా ఈ సంవత్సరం CBSC విధానాన్ని చేపడుతున్న సందర్భంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 23 వరకు ఇంటర్ తరగతి క్లాసులను నిర్వహించారు. ఆ తర్వాత జూన్ 1వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఈరోజు నుంచి తరగతి క్లాసులు యధావిధిగా ప్రారంభం కానున్నాయి.

ఈరోజు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన అనంతరం రేపటి నుంచి విద్యార్థులకు తరగతి క్లాసులు ప్రారంభిస్తామని ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. విద్యార్థులు వేసవి సెలవులు ముగించుకొని యధావిధిగా కాలేజీలకు రావాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే స్కూళ్లు కూడా రీఓపెనింగ్ కానున్నాయి. ఈనెల 12వ తేదీ నుంచి స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమవుతున్న తేదీ దగ్గర పడుతుండడంతో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు మరికొన్ని రోజులు వేసవి సెలవులు పొడిగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.